స్వతంత్ర భారతంలో ఇంతకాలం బెయిల్‌పై ఉన్న ఏకైక వ్యక్తి జగనే - కేంద్రం కాళ్లపై పడినందుకే : సీపీఐ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 1:38 PM IST

thumbnail

CPI Narayana on CM Jagan Bail: స్వతంత్ర భారతంలో ఇంతకాలం బెయిల్‌పై ఉన్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌ మోహన్ రెడ్డేనని.. సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కేంద్రం కాళ్లపై పడటంతోనే వైఎస్ జగన్ గత పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపారని నారాయణ ఆరోపించారు.

Narayana Comments: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో నారాయణ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వనందుకే చంద్రబాబును జైలుకు పంపారు. జైలు నుంచి బయటికి వచ్చాక మళ్లీ సపోర్ట్ చేయమని అడిగారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ లాంటి క్రిమినల్ గవర్నమెంట్ ఇంతవరకూ లేదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించిన వాళ్లంతా జైలులో ఉంటున్నారు.. సపోర్ట్ చేసేవాళ్లు ఎలాంటి వాళ్లైనా బయటే ఉంటున్నారు. ఖూనీకోరు, హత్యా కోరు, ఎకనామిక్ విరోధిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి బయటే ఉన్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత లాంగ్ పీరియడ్ బెయిల్‌పై ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్ జగనే. ఎందుకంటే ఈయన (జగన్) వెళ్లి ఆయన కాళ్లపై పడ్డాడు. కేంద్రం ఆశీస్సులు జగన్‌పై ఉన్నాయి కాబట్టే సీబీఐ, ఈడీ వంటివి జగన్‌కు వద్దకు వెళ్లటం లేదు.'' అని నారాయణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.