AP E Autos: ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్​..

By

Published : Jun 8, 2023, 9:42 PM IST

thumbnail

CM Jagan Started AP E Autos : క్లీన్ ఆంధ్రప్రదేశ్​లో భాగంగా తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చెత్తను సేకరించిందుకు ప్రవేశ పెట్టిన ఆటోలను తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 మున్సిపాలిటీలలో ఈ-ఆటోలు సేవలను అందించనున్నాయి. మొత్తం 516 ఈ-ఆటోలను ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని క్లీన్​ ఆంధ్రప్రదేశ్​గా మార్చాలన్న ధృడ సంకల్పంతోనే వీటిని ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. పర్యావరణ హితంగా ఉంటూ.. చిన్న మున్సిపాలిటీలపై నిర్వహణ భారం తగ్గేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే తడి, పొడి, హానికర వ్యర్థాల కోసం చెత్తను సేకరించేందుకు.. నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. గ్రేడ్​-1 ఆపై స్థాయి మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు.. 2వేల 525 పెట్రోల్​, డీజిల్​, సీఎన్జీ సహాయంతో నడుస్తున్న గార్బేజ్​ టిప్పర్లను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఆటోలను నడపటానికి డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో మహిళా డ్రైవర్లు కూడా ఉన్నారు. ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి ఈ ఆటోల ద్వారా డంపింగ్ యార్డు, ప్రాసెసింగ్ ప్లాంటుకు తరలిస్తారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.