Celebrities Remembered NTR in Chennai: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు.. చెన్నైలో సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 9:57 PM IST

thumbnail

Celebrities Remembered NTR in Chennai: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల సందర్భంగా ఎన్టీఆర్‌ లిటరేచర్, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో చెన్నైలోని ఆంధ్రా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోషియేషన్‌ వేదికగా సమాలోచన కార్యక్రమాన్ని జరిగింది. ఎన్టీఆర్ శాసన సభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలపై వెలువరించిన మూడు ఆమూల్య గ్రంథాలపై సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ, మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరీ, సీనియర్‌ నటుడు భానుచందర్‌ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. నేడు వివిధ రాష్ట్రంల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలకి ఆనాడే నాంది పలికిన ప్రజానాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎన్ని ఏళ్లు అయినా ఆయనకు సాటి మరొకరు లేరని కీర్తించారు. ఆయన నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఆయన నటించిన సినిమాలలోని పాత్రలను గుర్తు చేసుకుని కొనియాడారు. ఆయన పోషించిన పాత్రల వల్లే రాముడు, కృష్ణుడు అలా ఉంటారని చాలా మంది ప్రజలకు మనసుల్లో నాటుకుపోయిందని అభిప్రాయపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.