వైఎస్సార్సీపీని వీడేందుకు సిద్ధమైన విజయవాడ నగర అధ్యక్షుడు !
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 5:48 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-01-2024/640-480-20500433-thumbnail-16x9-boppana-bhavakumar.jpg)
Boppana Bhavakumar: విజయవాడ వైఎస్సార్సీపీలో కలకలం రేగుతోంది. విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీనికి వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తన అభిమానులు, కార్యకర్తలతో భవన్కుమార్ మాట్లాడారు. పార్టీ వీడొద్దంటూ తనపై వైఎస్సార్సీపీ అధిష్టానం నుంచీ తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. అయితే, భవకుమార్ వీడేందుకు ఆయన సిద్ధమయినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. 2019నుంచీ వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడుగా భవకుమార్ కొనసాగుతున్నారు. పార్టీ వీడొద్దంటూ ఆయన వద్దకు దేవినేని అవినాష్, ఇతర వైఎస్సార్సీపీ నేతల రాయబారం చేశారు. తెలుగుదేశం నేతలతోనూ సంప్రదింపుల్లో ఉన్నానని భవకుమార్ తెలిపారు. కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులతో మాట్లాడి త్వరలో తన నిర్ణయం చెబుతానని వెల్లడించారు. ఉమ్మడి కృష్ణ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఇప్పటికే వైఎస్సార్సీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశమై దేవినేని అవినాష్ ను ప్రశ్నించగా, తాను కేవలం మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. నేతలు పార్టీలు మారడంపై స్పందించిన ఆయన, తెలుగుదేశం నుంచి గెలిచిన బలమైన నాయకులు నేడు వైఎస్సార్సీపీకి వస్తున్నారని తెలిపారు.