ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే ప్రధానోపాధ్యాయుడు మృతి : ఏపీటీఎఫ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 12:41 PM IST

thumbnail

Associations Protest Against Teacher's Death : విజయనగరం జిల్లాలో కాగితాపల్లి జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంప సుధాకర్​ మృతికి డీఈఓ, డిప్యూటీ డీఈఓ వేధింపులే కారణమని ఉపాధ్యాయులు నల్ల జెండాలు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. రాజాం అంబేడ్కర్​ కూడలి నుంచి బొబ్బిలి జంక్షన్​ వరకు ర్యాలీ చేశారు. అనంతరం అంబేడ్కర్​ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు.

Demand to Take Action Against Those Responsible for the Death : పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వ అధికారులు వేధింపులకు గురిచేయడం వల్లనే సుధాకర్​ మరణించాడని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్​ మృతికి కారణమైన డీఈఓ, డిప్యూటీ డీఈఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సుధాకర్​ మృతిని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. అధికారుల వేధింపుల కారణంగానే సుధాకర్​ మానసికంగా కుంగిపోయి గుండె పోటుతో మృతి చెందాడని ఏపీటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు మదన్​ మోహన్​ రావు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.