కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయంలో అంబరాన్నంటిన ఆరుద్రోత్సవాలు - వైభవంగా జ్యోతి దర్శనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 1:01 PM IST

thumbnail

Arudrothsavam in Kotappakonda Trikoteswara Temple : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయంలో ఘనంగా ఆరుద్రోత్సవాలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా  దేవస్థానాన్ని పూలతో, విద్యుత్ అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. మంగళవారం అర్ధరాత్రి జ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహించి. రుద్రాభిషేకం చేశారు. జ్యోతి దర్శన సమయంలో  భక్తులు హారతులు ఇస్తూ త్రికోటేశ్వర నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. ఆరుద్రోత్సవ వేడుకల సందడిని కనులారా దర్శించేందుకు ఆలయానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Kotappakonda Sri Trikoteswara Swamy Temple in Palnadu District : స్వామి వారికి నిత్యం అభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు చేశారు. మేధాదక్షిణామూర్తి మాల ధరించిన భక్తులు ఆలయానికి విచ్చేసి దీక్షా విరమణ చేశారు. దీక్ష విరమణ చేసిన భక్తులకు దాతల సహకారంతో ఆలయాధికారులు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.