మున్సిపల్​ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్​ ఏర్పాటు: బొప్పరాజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 10:29 PM IST

thumbnail

AP Municipal Employees Service Association Formation: మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఉద్యోగులు పదోన్నతులు పొందలేకపోతున్నారని ఏపీ ఐకాస అమరావతి,  మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి 7న విశాఖలో ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చట్టబద్ధంగా తమకు రావాల్సిన పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించడం లేదని బొప్పరాజు అన్నారు. నగరపాలక సంస్థల ఏర్పాటులో ఉత్సాహం చూపిస్తోన్న ప్రభుత్వం, సిబ్బంది నియకాలపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 

కార్పోరేషన్​లను అయితే ప్రభుత్వం త్వరగా ఏర్పాటు చేసిందని, గ్రామీణ ప్రాంతాలను తీసుకువచ్చి కార్పోరేషన్లలో కలిపారని అన్నారు. జనాబా పెరిగిపోయిందని, ఉద్యోగుల సంఖ్య తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సమస్యలను అధిగమించడానికి, కేడర్​ బలాన్ని తిరిగి పొందడానికి, అన్ని కేడర్లను కలుపుకుని ఏపీ​ మున్సిపల్​ ఎంప్లాయిస్ సర్వీస్​ అసోసియేషన్ ​ ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. హైదరాబాద్​ కార్పోరేషన్​ నియమాలు పాటించమని కొన్ని కార్పోరేషన్లకు, జీవీఎంసీ నియమాలు పాటించమని మరికొన్ని కార్పోరేషన్లకు సూచిస్తున్నారని మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్​ అన్నారు. దీనివల్ల ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.