కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని క్యాంబెల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఏటీఎంను ధ్వంసం చేశారు. అనంతరం దోపిడీకి విఫలయత్నం చేశారు. జమ్మలమడుగులోని ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని ఎస్ఐ రవి కుమార్ పేర్కొన్నారు.
త్వరలోనే పట్టుకుంటాం..
డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీంను పిలిపించి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలనతో దొంగలను త్వరగా పట్టుకుంటామని ఎస్ఐ వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్