ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

author img

By

Published : Jan 22, 2021, 7:48 PM IST

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడప శివారులోని రాయచోటి రైల్వే వంతెన వద్ద జరిగింది. హెల్మెట్ లేకపోవడంతోనే బలమైన గాయాలు తగిలాయని.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.

two wheelers collided in kadapa railway bridge
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురుకి తీవ్ర గాయాలు

కడప శివారులోని రాయచోటి రైల్వే వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి హెల్మెట్ లేకపోవడంతోనే బలమైన గాయాలయ్యాయని రైల్వే పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని స్థానికులు హుటాహుటీన రిమ్స్​కు తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

ఇదీ చదవండి: ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.