ETV Bharat / state

వరద బాధితులకు తెదేపా చేయూత

author img

By

Published : Nov 22, 2021, 12:39 PM IST

వరద బాధితులకు తెదేపా చేయూత
వరద బాధితులకు తెదేపా చేయూత

భారీ వర్షాలతో కడప జిల్లా అతలాకుతలం అయింది. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు తెదేపా పలుచోట్ల సేవా కార్యక్రమాలను చేపట్టింది.

తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కడప జిల్లా అతలాకుతలం అయ్యింది. పలువురు దాతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ... బాధితులకు చేయూత అందిస్తున్నారు. జిల్లాలోని బద్వేల్‌కి చెందిన తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు తమ కుటుంబ సభ్యులతో వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. రాజంపేట, ఎగువ పల్లి, దిగువ పల్లి గ్రామాల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఇదీ చదవండి: వర్ష బీభత్సం..ధ్వంసమైన రోడ్లు, కొట్టుకుపోయిన వంతెనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.