ETV Bharat / state

పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం

author img

By

Published : Nov 13, 2019, 9:34 AM IST

పులివెందుల నియోజకవర్గం అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి వైయస్​ జగన్​ తనసొంత నియోజకవర్గమైన పులివెందులను అభివృద్ధి చేసేందుకు అధికారులకు సూచించారు. కడప కలెక్టర్ హరికిరణ్ ఎంపీడీవో సమావేశంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏపీ సీఎం తన సొంత నియోజకవర్గమైన పులివెందులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కడప కలెక్టర్ హరికిరణ్ ఎంపీడీవో సమావేశంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్​లో సీఎం జగన్ ప్రోగ్రాం ఉందని ఆలోపు అన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. పులివెందుల, రాయచోటి నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్​కు సంబంధించి రూ.1200 కోట్లతో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సీఎం జగన్ వచ్చే నెలలో వీటికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే పులివెందులకు ఒక ఇండోర్ స్టేడియం, మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగులను సీఎంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అధికారులు త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు.

ఇదీ చదవండి:

నిరుద్యోగులపై సీఎంకు అంత కక్ష ఎందుకు? నారా లోకేష్

AP_CDP_53_12_MP_REIVU_MEETING_av_AP10042 REPORTER: M.MaruthiPrasad CENTER: Pulivendula యాంకర్ వాయిస్: ఏపీ సీఎం వైఎస్ జగన్ తనసొంత నియోజకవర్గమైన పులివెందులను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడంతో కడప కలెక్టర్ హరి కిరణ్ పులివెందులలోని ఎంపీడీవో సమావేశం హాల్ లో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ లో సిఎం జగన్ పులివెందులలో ప్రోగ్రాం ఉండడంతో ఆలోపు అన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. పులివెందుల, రాయచోటి నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రూ.1200 కోట్లతో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరి కిరణ్ తెలిపారు. సీఎం జగన్ వచ్చే నెలలో వీటికి శంకుస్థాపన చేస్తారు. అలాగే మెడికల్ కాలేజీ సంబంధించి స్థలం కేటాయింపు, ముఖ్యంగా యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలకోసం సిబిఆర్ నుంచి నీటిని కెనాల్ ద్వారా అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇంజనీర్లు తయారు చేస్తున్నారని అలాగే పులివెందులకు ఒక ఇండోర్ స్టేడియం, మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగులు వంటివి డిసెంబర్ లో సీఎం గారిచే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు...

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.