ETV Bharat / state

'చంద్రబాబు సభలో రాళ్ల దాడి హేయమైన చర్య'

author img

By

Published : Apr 13, 2021, 4:49 PM IST

రాజకీయ విలువలు లేని వైకాపా ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్ అన్నారు. తిరుపతిలో చంద్రబాబు సభలో రాళ్లదాడి హేయమైన చర్య అని ఆయన విమర్శించారు.

rajampeta tdp protest
తిరుపతి చంద్రబాబు సభలో రాళ్లదాడిపై రాజంపేటలో నిరసన

తిరుపతి సభలో తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా దుండగులు దాడి చేయడం హేయమైన చర్య అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధాకర్ ధ్వజమెత్తారు. చంద్రబాబుపై దాడికి నిరసనగా కడప జిల్లా రాజంపేటలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. మహాత్మాగాంధీకి పూలదండ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతపై రాళ్ల దాడి చేయించడం దారుణమని.. రాజకీయ విలువలు లేని వైకాపా ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతోందని సుధాకర్ విమర్శించారు. వైకాపాకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: వివేకా కేసులో సీబీఐ దర్యాప్తునకు సీఎం హాజరవుతారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.