ETV Bharat / state

దిల్లీలో రైతులకు మద్దతుగా ఎర్రగుంట్లలో కాంగ్రెస్ నేతల దీక్ష

author img

By

Published : Dec 2, 2020, 1:58 PM IST

protest  of Congress leaders in Erraguntla in support of farmers in Delhi
దీల్లీలో రైతులకు మద్దతుగా ఎర్రగుంట్లలో కాంగ్రెస్ నేతలు దీక్ష

దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు దీక్ష చేశారు. కేంద్రప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నా రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారని..ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధర ఇస్తామని లిఖితపూర్వక హామీ కోసం డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. రైతులకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి. కురుస్తున్న మంచు.. వణుకుతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.