ETV Bharat / state

కడప జిల్లాలో వాలంటీర్లకు సేవా పురస్కారాలు

author img

By

Published : Apr 13, 2021, 10:24 AM IST

వాలంటీర్ల స్వచ్ఛంద సేవలను గుర్తిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర, విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమాన్ని కడప జిల్లాలో ఎంపీ అవినాష్​రెడ్డి ప్రారంభించారు.

service awards to volunteers v
వాలంటీర్లకు సేవా పురస్కారాలు

అనేక రకాల పథకాలను ప్రజల ముంగిటకే చేర్చి గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఎంపీ వైఎస్​ అవినాష్​రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని కదిరి రహదారిలో ఉన్న ఎస్​ఎస్​ఆర్ గార్డెన్​ పంక్షన్​ హాలులో సోమవారం నియోజకవర్గంలోని వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. మెుదటగా దివంగత వైఎస్​ఆర్​ విగ్రహానికి పూలమాల వేశారు. గడిచిన 23 నెలల్లో పరిపాలనలో విప్లవాత్మక మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్​ వ్యవస్థ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు.

రాబోయే రోజుల్లో నియోజకవర్గాల వారీగా సచివాలయాల వద్దకు వెళ్లి.. సమస్యలు తెలుసుకుని వాటిని ముఖ్యమంత్రి సాయంతో పరిష్కరిస్తామని చెప్పారు. కలెక్టర్​ హరికిరణ్​, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడారు. ఉత్తమ ప్రతిభ చూపిన పులివెందుల నియోజకవర్గంలోని 1244 మంది వాలంటీర్లకు సేవా మిత్రు. 40 మందికి సేవారత్న, 5 మందికి సేవా వజ్ర పురస్కరాలు అందజేశారు. నగదు, పతాకం, ప్రత్యేక బ్యాడ్జ్​లను అందజేస్తూ శాలువాతో ఎంపీ, కలెక్టర్​ వారిని సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీనివాసులరెడ్డి, డీడీఓ ప్రభాకర్​ రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ మధుసూదన్​రెడ్డి, ఓఎస్టీ అనీల్​కుమార్​రెడ్డి.. పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఇంటి ఎత్తును దాటి.. 15 అడుగులను మించి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.