ETV Bharat / state

పండగ ముగిసింది... పట్నం పిలిచింది!

author img

By

Published : Jan 17, 2021, 8:14 PM IST

సంక్రాంతిని జరుపుకునేందుకు పట్టణాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారంతా... బతుకుదెరువు కోసం మళ్లీ తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులతో కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడుపుతున్నారు.

kadapa rtc bus stand crowded with return passengers
తిరుగు ప్రయాణికులతో కడప ఆర్టీసీ బస్టాండ్

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణాలు సాగిస్తున్నారు. దీనివల్ల కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే వారితో బస్టాండ్ ఆవరణం పూర్తిగా నిండిపోయింది. రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తిరుగు ప్రయాణమయ్యే వారికి... ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.