కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని మాండవ్య, పాపాగ్ని, పెన్నా, చెయ్యరు, బాహుదా, కుందూ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెలిగల్లు, ఝరికోన, పిచ్చా, శ్రీనివాసపురం రిజర్వాయర్, మైలవరం, గండికోట ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుంది. ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికార యంత్రాంగం తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కడప నగరం మొత్తం నీట మునిగింది. రోడ్లపై మోకాళ్ళ లోతు వరకు వర్షపు నీరు చేరింది. మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: శ్రీశైలం జలాశయానికి వరద....3 గేట్లు ఎత్తి నీటి విడుదల