ETV Bharat / state

కడప జిల్లాలో భారీ వర్షాలు.. ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

author img

By

Published : Nov 29, 2020, 8:34 PM IST

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వేకోడూరు నియోజకవర్గంలో రైతులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది.

బాధితులకు ఆహార పొట్లాలను అందిస్తున్న నరసింహ ప్రసాద్
బాధితులకు ఆహార పొట్లాలను అందిస్తున్న నరసింహ ప్రసాద్

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. ప్రజలు ఇబ్బందులను గుర్తించిన చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్ నాలుగు వందల కుటుంబాలకు ఆహార పొట్లాలను అందించారు. ఓబులవారిపల్లె మండలంలో రైతులను పరామర్శించారు. తుపాన్ దాటికి నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైకాపా ఎమ్మెల్యే తన సొంత గ్రామంలో బ్రిడ్జిని కూడా నిర్మించలేదని విమర్శించారు.

ఇదీచదవండి

నివర్ ప్రభావం.. పూర్తిగా నిండిన వెలిగల్లు జలాశయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.