Exams: పదో తరగతి ప్రీఫైనల్ సామాన్యశాస్త్రం పరీక్షకు.. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రాలను సరఫరా చేసిన ఘటనిది. కడప జిల్లా కలసపాడు మండలం శంకరవరం జిల్లాపరిషత్తు పాఠశాలకు శనివారం పది పరీక్షలకు ఎనిమిదో తరగతి సమ్మెటివ్-2 సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రాలు సరఫరా అయ్యాయి. సీల్డ్కవర్ను తెరిచిన ప్రధానోపాధ్యాయుడు విషయాన్ని గుర్తించి.. సామాన్యశాస్త్రం ప్రశ్న పత్రాలను తెప్పించి పరీక్ష నిర్వహించారు. సెమ్మెటివ్-2 పరీక్షల షెడ్యూల్ను ఇప్పటివరకు ప్రకటించకపోయినా ప్రశ్నపత్రాలు మాత్రం ముందుగానే వచ్చేశాయి.
ఇదీ చదవండి:
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కలకలం.. రెండు రోజుల్లో ముగ్గురు చిన్నారులు మృతి