ETV Bharat / state

వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ మూడు రోజుల పర్యటన.. వివరాలివే..

author img

By

Published : Dec 22, 2022, 10:03 PM IST

Updated : Dec 23, 2022, 6:21 AM IST

CM Jagan Kadapa Tour: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేటినుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్​ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నరకు తాడేపల్లిలో బయల్దేరనున్న సీఎం.. కడపకు చేరుకోగానే పెద్దదర్గాను సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు వీరారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి ఇళ్లకు వెళ్లనున్నారు. అనంతరం కడపలో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. మధ్యాహ్నం కమలాపురం వెళ్లనున్న సీఎం.. 900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.

CM Jagan
సీఎం జగన్‌

CM Jagan Kadapa Tour: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం అమీన్​పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం కమలాపురం చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగిస్తారు.

24వ తేదీన ఉదయం సీఎం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్​ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పులివెందులలో రూ. 154 కోట్లతో రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేస్తారు. అలాగే పులివెందులలో మార్కెట్ యార్డు, మైత్రి లే అవుట్ పార్కు, రాయలపురం బ్రిడ్జి, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వాటితో పాటుగా విజయ హోమ్స్ జంక్షన్​ను ప్రారంభిస్తారు. కూరగాయల మార్కెట్, మైత్రి లేఔట్, రాయలపురం బ్రిడ్జి, అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆర్టీసీ బస్టాండ్​ను ప్రారంభించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.

తర్వాత ఇడుపులపాయకు బయలుదేరి 25వ తేదీ ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం తాడేపల్లికి బయలుదేరుతారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.