ETV Bharat / state

Viveka Murder Case: పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ

author img

By

Published : Aug 23, 2021, 6:04 PM IST

Updated : Aug 23, 2021, 6:59 PM IST

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

18:01 August 23

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందులలో వివేకా ఇంటిని సీబీఐ అధికారులు మరోసారి పరిశీలించారు. ఇంట్లోని బాత్‌రూమ్, బెడ్‌రూమ్​ను అధికారులు పరిశీలించారు. అనంతరం వివేకా భార్య సౌభాగ్యమ్మతో మాట్లాడారు. 

సమాచారమిస్తే రివార్డు..

వివేకా హత్యకేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 21న పత్రికా ప్రకటన ఇచ్చింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని..హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది. 

ఇదీ చదవండి:  CM Jagan: అక్టోబరు 25 నుంచి పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి: సీఎం జగన్

Last Updated : Aug 23, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.