ETV Bharat / state

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. 12 మందికి తీవ్ర గాయాలు

author img

By

Published : May 17, 2022, 12:59 AM IST

కడపలో కారు బోల్తా
car overturned in kadapa district

Devotees car overturned in YSR district: కడప జిల్లా సిద్ధారెడ్డిగారిపల్లి- తలుపుల రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో 12 మంది గాయపడగా.. ముగ్గురు చిన్నారు పరిస్థితి విషమంగా ఉంది. కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది.

కడప జిల్లా చక్రాయపేట మండలంలోని సిద్ధారెడ్డిగారిపల్లి - తలుపుల మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని కడపకు వస్తుండగా.. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 7 మంది పిల్లలు, 5 మంది పెద్దలు ఉన్నారు. అయితే ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను వెంటనే వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్​కు తరలించారు. క్షతగాత్రులల్లో కొందరు పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురం వాసులు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి: LORRY: ఉరవకొండ శివారులో కంటైనర్​ బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.