ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో వీరభద్రరావు, వీర సుబ్రమణ్యం అనే ఇద్దరు మరణించారు, మరో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవంలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మెరు వద్ద ఈ ఘటన జరిగింది.
దైవదర్శనానికి తిరుపతి వెళ్లి తిరిగి సామర్లకోట వైపు వస్తున్న కారును.. విశాఖపట్నం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ముగ్గురిని రాజమహేంద్రవరంలోని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: