ETV Bharat / state

అత్తిలిలో విషాదం.. ఫార్మాలిన్ కలిపిన నీళ్లు తాగి ఇద్దరు మృతి

author img

By

Published : Sep 13, 2022, 11:51 AM IST

Updated : Sep 13, 2022, 4:01 PM IST

Two Men Dead
కార్మికుల మృతి

11:45 September 13

మంచినీళ్లు అనుకుని ఫార్మాలిన్‌ మందు కలిపిన నీళ్లు తాగి ఇద్దరు కార్మికులు మృతి

పార్మలిన్​ మందు కలిపిన నీళ్లను తాగి చనిపోయిన ఇద్దరు కార్మికులు

Two Men Died: పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో విషాదం చోటు చేసుకుంది. మంచినీళ్లు అనుకొని ఫార్మాలిన్ మందు కలిపిన నీళ్లు తాగిన ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామానికి చెందిన నడింపల్లి సుబ్బరాజు, పాత గొలుసు రామకృష్ణ గత రెండు సంవత్సరాలుగా అత్తిలిలోని ఓ కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. కోళ్లఫారంలో పెంపకానికి చిన్న పిల్లలు తీసుకువస్తున్న సందర్భంలో.. యజమానుల సూచన మేరకు ఫార్మాలిన్ మందును ఫారంలో స్ప్రే చేశారు. భోజనానికి వెళ్తున్న సమయంలో మందు కలిపిన నీళ్లను తాగారు. మందు నీళ్లు, మంచినీళ్లు ఉన్న డబ్బాలు పక్కనే పక్కనే ఉండగా పొరపాటున మంచినీళ్లు అనుకుని ఫార్మాలిన్ మందు కలిపిన నీళ్లను తాగారు. అస్వస్థతకు గురైన వీరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందడానికి ముందు బాధితుడు పొరపాటున ఫార్మాలిన్ మందు కలిపిన నీళ్లను తాగినట్లు తెలిపినట్లు సీఐ ఆంజనేయులు వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 13, 2022, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.