ETV Bharat / state

తణుకు ఎంపీపీ పాఠశాలలో పుడ్​ పాయిజన్​.. విద్యార్థులకు అస్వస్థత

author img

By

Published : Feb 27, 2023, 7:54 PM IST

STUDENTS HOSPITALIZED DUE TO FOOD POISON
STUDENTS HOSPITALIZED DUE TO FOOD POISON

STUDENTS HOSPITALIZED DUE TO FOOD POISON: మధ్యాహ్న భోజనం వికటించి మున్సిపల్​ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు కావడంతో ఉపాధ్యాయులు తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

STUDENTS HOSPITALIZED DUE TO FOOD POISON IN TANUKU : మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఆసుపత్రి పాలైనా ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. తణుకు పట్టణంలోని హౌసింగ్​ బోర్డ్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనంగా పొంగలి, సాంబార్​ అన్నం, కోడిగుడ్డు పెట్టారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఐదుగురు విద్యార్థులకు వాంతులు అయ్యాయి. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారితో పాటు మరో 12 మంది విద్యార్థులనూ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్పందించి చికిత్స అందించటంతో విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

జరిగిన ఘటనపై విద్యా శాఖ అధికారులు పాఠశాలను సందర్శించి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులు అందరూ క్షేమమని జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని మండల విద్యా శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతమున్న వంట ఏజెన్సీని రద్దు చేసి కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

వాంతులతో విద్యార్థులు ఆసుపత్రికి వచ్చారని.. వారికి అవసరమైన చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ఐదుగురు విద్యార్థులకు సెలైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆహారం కలుషితం వల్ల ఏర్పడిన ఇబ్బంది కాదని, ఆహారం సరిగ్గా అరుగుదల కాకపోవడం వల్ల వాంతులు అయి ఉండొచ్చని హాస్పిటల్ సూపరింటెండెంట్ శివ ప్రసాద్ వెల్లడించారు.

ఆసుపత్రి వద్ద వైసీపీ, జనసేన వివాదం: అయితే తణుకు ప్రభుత్వాసుపత్రి వద్ద అధికార పార్టీ వైఎస్సార్సీపీ, జనసేన పార్టీ మధ్య వివాదం నెలకొంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. పాఠశాలలో సరైన భోజనం అందించకనే విద్యార్థులు ఆసుపత్రి పాలైయ్యారని జనసేన నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం మధ్యాహ్న పథకం గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప.. దానిని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించారు.

FOOD POISON IN BC GIRLS HOSTEL : సరిగ్గా ఇదే నెల(ఫిబ్రవరి 7న) విజయనగరం జిల్లా కొత్తవలసలోని బీసీ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. ఉదయం టిఫిన్​ కింద పులిహోర తిన్న అనంతరం.. పాఠశాలకు వెళ్తూ వాంతులతో కింద పడిపోయారు. వెంటనే గమనించిన ఉపాధ్యాయులు కొత్తవలస ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 14 మంది కోలుకోగా.. మిగిలిన 10 మందికి ట్రీట్​మెంట్​ కొనసాగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.