ETV Bharat / state

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

author img

By

Published : Feb 28, 2021, 10:00 PM IST

Updated : Feb 28, 2021, 11:00 PM IST

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానస్పదంగా మృతి
ప్రియుడితో కలిసి వివాహిత అనుమానస్పదంగా మృతి

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. ఏలూరు నగరానికి చెందిన షేక్ నాగూర్​తో కుసుమ నాగసాయి కుమారికి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగానే యువతి తల్లిదండ్రులు ఆమెని నిడదవోలు మండలం తాళ్లపాలెంకి చెందిన శ్రీనివాస్​కి ఇచ్చి పెళ్లి చేశారు. 2014లో పెళ్లి జరిగినప్పటికీ నాగసాయి కుమారి తన ప్రియుడు నాగూర్​తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూనే ఉంది.

భార్య వ్యవహారంపై కొద్దికాలంగా భర్త శ్రీనివాస్​కు అనుమానం వచ్చింది. తాజాగా వీరిద్దరూ తాళ్లపాలెంలో నాగూర్ బంధువులకు చెందిన ఇంట్లో ఉండగా... భర్త శ్రీనివాస్ కొంతమంది యువకులతో కలిసి వెళ్లి భార్య, ఆమె ప్రియుడు నాగూర్​పై దాడి చేశారు. వారిద్దర్నీ అక్కడి నుంచి తీసుకెళ్లి శెట్టిపేటలోని శ్రీనివాస్ బంధువుకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో నిర్బంధించారు. ఆ గదిలో దొరికిన ఎలుకల మందును వీరు ఇరువురు తిని చనిపోయినట్లు సమాచారం. నాగసాయి కుమారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిడదవోలు సీఐ కే.ఎ. స్వామి తెలిపారు.

ఇవీ చదవండి

చేపల వేటకోసం మంత్రికి వినతిపత్రం..!

Last Updated :Feb 28, 2021, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.