ETV Bharat / state

నాపై దాడికి యత్నం.. జగన్ మనుషుల్ని పంపాడు: కే.ఏ.పాల్

author img

By

Published : Apr 6, 2019, 10:20 PM IST

తనపై దాడి చేసేందుకు జగన్ మనుషుల్ని పంపించాడని ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే హత్యారాజకీయాలు పెరిగిపోతాయని... రాష్ట్రం రావణ కాష్ఠం అవుతుందన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్

తనపై దాడి చేసేందుకు జగన్ మనుషుల్ని పంపించాడని ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్ ఆరోపించారు. భీమవరంలోని ఓ ప్రైవేటు హోటల్​లో బస చేయగా తనపై దాడి చేయడానికి అర్థరాత్రి సమయంలో కొంతమంది అగంతకులు వచ్చారని అన్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమరాలలో రికార్డ్ అయ్యాయన్నారు. ఇటువంటి రాజకీయాలకు భయపడనన్నారు. జగన్ అధికారంలోకి వస్తే హత్యారాజకీయాలు పెరిగిపోతాయని... రాష్ట్రం రావణ కాష్ఠం అవుతుందన్నారు.

ఇదీ చదవండి

హామీ ఇస్తున్నాం... మళ్లీ వస్తాం!: చంద్రబాబు

Intro:Ap_Vsp_61_06_Ganta_In_Muslim_Aathmeeya_Sadassu_Ab_C8


Body:రానున్న ఎన్నికల్లో తెదేపా గెలిస్తే ముస్లింలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో తెలిపారు తెదేపా ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశాన్ని స్పష్టం చేశారని చెప్పారు తెదేపా విశాఖనగర అధ్యక్షుడు ఎస్ ఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సదస్సు లో మంత్రి గంటా పాల్గొని ప్రసంగించారు తెదేపా ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడించారు ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కీలకమని అన్నారు ఈ నేపథ్యంలో 16 నెలలు జైల్లో ఉన్న జగన్ను ప్రజలు ఎలా విశ్వసిస్తారని ఎద్దేవా చేశారు మోదీ కరెంటు ఇస్తే కేసీఆర్ స్పీచ్ ఆన్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ తిరుగుతుందని మోడీ కెసిఆర్ ల దర్శకత్వంలో జగన్ నడుస్తున్నారని గంటా విమర్శించారు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి సమర్థుడైన నాయకులు ఎన్నుకోవాలని కోరారు
---------
బైట్: గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి
--------- ( ఓవర్).


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.