ETV Bharat / state

పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి..ఉపరాష్ట్రపతికి రైతు సంఘాల నాయకుల విన్నపం

author img

By

Published : Aug 7, 2021, 6:24 PM IST

పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు ఉపరాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల నాయకులతో తెదేపా ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.

ఉపరాష్ట్రపతికి రైతు సంఘాల నాయకుల విన్నపం
ఉపరాష్ట్రపతికి రైతు సంఘాల నాయకుల విన్నపం

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ.. తెదేపా ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలు రైతు సంఘాల నాయకులతో కలిసి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని దిల్లీలో కలిశారు. పోలవరంలో రైతులు పడుతున్న బాధలను, కష్టాలను ఉపరాష్ట్రపతికి వివరించి.. రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం అంతా కోల్పోయి వీధినపడ్డ పోలవరం నిర్వాసితులకు ఆదివాసీల సంఘాలకు పునరావాసం కల్పించేలా సూచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

CBI COURT NOTICES: బెయిల్ రద్దు పిటిషన్‌లో విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.