ETV Bharat / state

'శిరోముండనం బాధితుడిని కొందరు బలి చేస్తున్నారు'

author img

By

Published : Aug 11, 2020, 3:33 PM IST

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాయడంపై ఏలూరు రేంజ్​ డీఐజీ మోహన్ రావ్ స్పందించారు. బాధితుడు వరప్రసాద్​తో చట్టవిరుద్ధమైన పనులు చేయిస్తున్నారని.. అన్నారు. రాజకీయాల కోసం వరప్రసాద్​ను బలిపశువు చేస్తున్నారని పేర్కొన్నారు.

'శిరోముండనం బాధితుడిని కొంతమంది బలి చేస్తున్నారు'
'శిరోముండనం బాధితుడిని కొంతమంది బలి చేస్తున్నారు'

శిరోముండన ఘటన బాధితుడితో చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారని.. డీఐజీ మోహన్ రావ్ అభిప్రాయపడ్డారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ పనులు చేయిస్తున్నారని... వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తనను మావోయిస్టుల్లో కలపాలని బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాయడం వెనక కొందరి స్వార్థప్రయోజనాలు ఉన్నాయని డీఐజీ అభిప్రాయపడ్డారు. చట్టవ్యతిరేకంగా నడుచుకునేవారిపై తాము చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

మాకు మహానగరాలు లేవు.. మెరుగైన వైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.