ETV Bharat / state

ద్వారక తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.54 కోట్లు

author img

By

Published : Feb 5, 2021, 9:22 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు. 15 రోజులకు శ్రీ వారి హుండీకి రికార్డు స్థాయిలో రూ.1.54 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

dwarka thirumala srivari hundi income is rs 1.54 crore in 15days in west godavari district
ద్వారక తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.54 కోట్లు

ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపును ఆలయ అధికారులు శుక్రవారం నిర్వహించారు. 15 రోజులకు గాను శ్రీ వారి హుండీకి నగదు రూపంలో కోటీ 54లక్షల 91వేల 55 రూపాయల ఆదాయం వచ్చింది. కానుకల రూపేణా 305 గ్రాముల బంగారం, 4.310 కేజీల వెండి లభించినట్లు ఆలయ ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందన్నారు.

ఇదీ చదవండి

కొప్పర్రులో 'ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు' ఉద్యమం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.