ETV Bharat / state

లాక్​డౌన్​లోనూ ద్వారకా తిరుమలలో కేశ ఖండన...వ్యక్తి అరెస్టు

author img

By

Published : May 30, 2020, 4:37 PM IST

ద్వారకా తిరుమల ఆలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే కార్యక్రమం నిర్వహించటం చర్చనీయాంశమైంది. ఓ క్షురకుడు కొన్ని రోజుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా స్థానిక శ్రీ శ్రీనివాస కళాశాల వెనుక నిర్మానుష్యంగా ఉన్న స్థలంలో భక్తుల తలనీలాలు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.

dwaraka tiurmala temple
dwaraka tiurmala temple

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను ఓ క్షురకుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి క్షవరాలు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లాక్​డౌన్ నేపథ్యంలో ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో దర్శనాలు, కేశ ఖండనశాల కార్యకలాపాలను దేవస్థానం పూర్తిగా నిలిపివేసింది. స్వామి వారికి నిత్యకైంకర్యాలు మాత్రమే జరిపిస్తున్నారు. అయితే ఓ క్షురకుడు కొన్ని రోజుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా స్థానిక శ్రీ శ్రీనివాస కళాశాల వెనుక నిర్మానుష్యంగా ఉన్న స్థలంలో భక్తుల తలనీలాలు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. భక్తులు గుంపులుగా అక్కడకు చేరుకుని తలనీలాలు సమర్పిస్తున్నారు. అతను భక్తులకు గుండు కొట్టి అందినంత దోచుకుంటున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ క్షురకుడ్ని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి

ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.