ETV Bharat / state

OLX కస్టమర్లే టార్గెట్​.. ఏకంగా 18 దోపిడీలు

author img

By

Published : Mar 8, 2023, 7:29 PM IST

thief cheated OLX customers news
OLX కస్టమర్లకు టోకరా వేసిన దుండగుడు

Cheating: ఓఎల్​ఎక్స్ వెబ్​సైట్​ను ఆశ్రయించే వినియోగదారులను మోసం చేయటమే లక్ష్యంగా చేసుకుని పలు దోపిడీలకు పాల్పడ్డాడు విజయనగరానికి చెందిన ఓ దుండగుడు. ఇలా ఏకంగా 18 దోపిడీలు చేశాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి నుంచి 2 ల్యాప్​టాప్​లు, 2 సెల్​ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..?

Cheating: ఓఎల్ఎక్స్ వెబ్​సైట్​ వినియోగదారులనే లక్ష్యంగా చేసుకున్న ఓ దుండగుడు దోపిడీలకు పాల్పడ్డాడు. ఇలా హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో చాలా దోపిడీలు చేశాడు. ఇంతకుముందు ఆ దుండగుడు హైదరాబాద్​లో పోలీసులకు చిక్కి.. జైలుశిక్ష అనుభవించాడు. అయినా కూడా తన ప్రవర్తనలో మార్పులేదు. ప్రవృత్తిని మానుకోలేదు. అనంతరం తన స్వగ్రామం విజయనగరం వచ్చిన ఆ దుండగుడు.. తన చేతికి మళ్లీ పని చెప్పాడు. ఓఎల్ఎక్స్​లో వస్తువులను అమ్మకానికి పెట్టేవారిని లక్ష్యంగా చేసుకుని వల పన్నాడు. వారి నుంచి 2 ల్యాప్​టాప్​లు, 2 సెల్​ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. చివరకు.. విజయనగరానికి చెందిన ఓ బాధితుని ఫిర్యాదుతో మళ్లీ పోలీసులకు పట్టుబడ్డాడు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
విజయనగరానికి చెందిన కర్రి శివరామ కృష్ణ(38) అనే వ్యక్తి.. ఓఎల్ఎక్స్​ను ఆశ్రయించి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ల వంటి యాడ్‌లను పోస్ట్ చేసిన వ్యక్తులను మోసం చేయడమే అలవాటు చేసుకున్నాడు. అతడు పలుచోట్ల మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడి వాటిపైనే బాధితుల వద్దకు చేరుకుని.. అవి తనవేనని వారిని మోసం చేసి తీసుకుని.. వారితోనే విడిది చేసేవాడు. ఇలా హైదరాబాద్​లో దాదాపు 18 నేరాలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇదిలా ఉండగా.. విజయనగరానికి చెందిన ఓ యువకుడు మార్చి 3వ తేదీన ఓఎల్ఎక్స్​లో తన ల్యాప్​టాప్​ గురించి పోస్టు చేశాడు. ఇది గమనించిన కర్రి శివరామ కృష్ణ తదనుగుణంగా విశాఖపట్నంలో దొంగిలించిన AP 31 BQ 3753 నంబర్ గల మోటారు సైకిల్‌పై ఆర్​అండ్​బీ జంక్షన్​లో యువకుడిని సంప్రదించి, అతడిని ఆర్​అండ్​బీ జంక్షన్‌కు రమ్మని చెప్పాడు. ఆ యువకుడు అక్కడికి చేరుకోగా.. శివరామ కృష్ణ అతడిని మోసం చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే యువకుడు మాత్రం అతడి మాటలు నమ్మలేదు. దీంతో శివరామ కృష్ణ యువకుడికి కత్తి చూపించి బెదిరించాడు. అనంతరం నిందితుడు అతడిపై దాడి చేసి.. ల్యాప్​టాప్​ను యువకుడి నుంచి బలవంతగా తీసుకున్నాడు. దీంతో బాధితుడు విజయనగరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​ను ఆశ్రయించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి నుంచి 2 సెల్​పోన్లు, 2 ల్యాప్​టాప్​లు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి సీఐ వెంకటరావు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.