ETV Bharat / state

విద్యుత్ షాక్​తో విద్యార్థి మృతి

author img

By

Published : Mar 19, 2021, 10:04 AM IST

Student dies of electric shock
విద్యుత్ షాక్​తో విద్యార్థి మృతి

విద్యుత్ షాక్​తో విద్యార్ధి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొరియా గ్రామమైన.. గంజాయిభద్రలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న కొరియా వివాదస్పద గ్రామాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయిభద్ర గ్రామానికి చెందిన గెమ్మేల రోభి (17) బొబ్బిలిలో ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొద్దిరోజుల కిందట తల్లిదండ్రులు చూడడానికి ఇంటికి వచ్చాడు. ఈనెల 16న నేరెళ్ల వలస సంతకు వెళ్ళి వస్తుండగా.. మూత్ర విసర్జన చేస్తూ.. అక్కడే ఉన్న ఇనుప స్తంభాన్ని పట్టుకున్నాడు. అప్పటికే తెగిన విద్యుత్ వైరు ఆ స్తంభానికి తాకి ఉండటంతో.. విద్యుత్ షాక్​కు గురయ్యాడు. బందువులు సాలూరు పీహెచ్​సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్​కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దినకర్ తెలిపారు.

ఇవీ చూడండి...

సాలూరు పుర పాలక సంఘం చైర్ పర్సన్​గా పువ్వల ఈశ్వరమ్మ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.