విజయనగరం జిల్లా పెదతడివాడలో సెప్టెంబరు 24న అంబటి నాగరాజు (23) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబటి నాగరాజు అనే వ్యక్తి ఆసనాల పైడిరాజు దగ్గర పనిచేసేవాడు. యజమానికి అతని అన్న చిన్న పన్నకి.. పందుల పెంపకంలో వచ్చిన గొడవ జరిగింది. ఈ వివాదంలో నాగరాజు... పైడిరాజు అన్నని ప్రశ్నించాడు. ఆగ్రహించిన చిన్నపన్న కుమారులు.. నాగరాజును పందులు కట్టే తాడు ఉపయోగించి చంపేశారు. నిందితులను గుర్తించిన పోలీసులు.. అరెస్టు చేశారు.
ఇదీ చూడండి