ETV Bharat / state

కళాజాత బృందాలతో ఎయిడ్స్​పై అవగాహన కార్యక్రమాలు

author img

By

Published : Mar 15, 2021, 8:14 PM IST

Awareness programs on AIDS
ఎయిడ్స్​పై అవగాహనా కార్యక్రమాలు

విజయనగరం జిల్లాను ఎయిడ్స్ ర‌హితంగా మార్చాల‌ని జిల్లా పాలనాధికారి డా. హ‌రి జ‌వ‌హ‌ర్​లాల్ అన్నారు. కలెక్టర్​ కార్యాలయంలో.. హెచ్​ఐవీపై అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

విజయనగరం జిల్లాను ఎయిడ్స్​ర‌హితంగా మార్చాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవ‌గాహన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఎయిడ్స్ నివార‌ణ‌, నియంత్ర‌ణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 30 వ‌ర‌కు కళాజాత బృందాలు, వీధినాట‌కాల ద్వారా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

ముందుగానే ఎంపిక చేసిన గ్రామాల్లో పలు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారని కలెక్టర్​ తెలిపారు. ఎయిడ్స్ ఎలా సంక్ర‌మిస్తుంది, వ్యాప్తి, నివార‌ణ, నియంత్ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని పేర్కొన్నారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు త‌గ్గుతున్నాయ‌ని.. పూర్తిగా నివారించ‌డానికి ఇటువంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు.

ఇదీ చదవండి: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.