విశాఖ జిల్లా నర్సీపట్నం మూడో వార్డు పరిధిలోని రవి అనే వాలంటీరు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంటి వద్ద స్విచ్ బోర్డ్ ఆన్ చేసే క్రమంలో ఈ ప్రమాదానికి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడు రవి నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో సచివాలయం వాలంటీర్గా పనిచేస్తున్నాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'రష్యా వ్యాక్సిన్కు అన్ని పరీక్షలు జరగలేదు'