ETV Bharat / state

tribals protest at paderu: పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన..

author img

By

Published : Jan 6, 2022, 8:44 AM IST

పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. నేడు మన్యం బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది.

tribals protest at paderu
tribals protest at paderu

విశాఖ మన్యం గ్రామాల్లో పనిచేస్తున్న కోదూ, కువి భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, జీవో3 చట్టబద్ధత చేయాలని గిరిజన సంఘం ఏజెన్సీ నేడు బంద్​కు పిలుపునిచ్చింది. వేకువజామునుంచే పాడేరు కాంప్లెక్స్ వద్ద నిరసనకారులు బస్సులు, ప్రైవేటు వాహనాలను అడ్డగించారు. వాటిని ముందుకు వెళ్లనీయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 మందిని వాహనాల్లో ఎక్కించి పాడేరు, హుకుంపేట స్టేషన్ లకు తరలించారు.

పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన..

ఇదీ చదవండి:

CBN-HC : సీఐడీ కేసులో స్టే పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.