ETV Bharat / state

డోలీలో తీసుకొచ్చినా.. 108 అందుబాటులో లేక బాలింత మృతి

author img

By

Published : Oct 21, 2020, 9:34 AM IST

pregnant lady in doli
బాలింతను డోలీలో మోసుకొస్తున్న బంధువులు

నెలలు నిండిన ఓ బాలింత.. వైద్యం అందక ప్రాణాలు వదిలింది. కొండలు దిగి, గుట్టలు మీదుగా డోలీలో బాధితురాలిని తీసుకొచ్చినా ఫలితం దక్కలేదు. సమయానికి 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలంలో జరిగింది.

సకాలంలో వైద్యం అందక విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతానికి చెందిన ఓ బాలింత మృతి చెందింది. రావికమతం మండలం చలిసింగంలోని వంజరి రాజేశ్వరి అనే మహిళకు కాన్పు సమయం దగ్గర పడింది. బంధువులు ఆమెను కొండ మీదనున్న గ్రామం నుంచి కిందకు డోలీలో మోసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.

చలిసింగం నుంచి కొండలు దిగి, గుట్టలు దాటుకుని గంటన్నర పాటు ప్రయాణి స్తే.. సీకయపాడు నుంచి రోడ్డు ఉంటుంది. బంధువులు ఎంతో కష్టపడి ఆ బాలింతను డోలీలో కిందకు మోసుకు వచ్చారు. 108 వాహనానికి ఫోన్ చేయగా.. స్థానికంగా అందుబాటులో లేదని సిబ్బంది సమాధానమిచ్చారు. అప్పటికే రాజేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు కోటవురట్ల నుంచి వచ్చిన అంబులెన్స్​లో ఆక్సిజన్ లేకపోవడంతో మరణించింది.

ఇదీ చదవండి:

ఏవోబీలో మందుపాతరల కలకలం.. నిర్వీర్యం చేసిన బలగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.