ETV Bharat / state

టీడీపీకి బీసీల్లో ఉన్న ఆదరణ చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టింది: బుద్ధ వెంకన్న

author img

By

Published : Dec 10, 2022, 3:49 PM IST

MLC Buddha Venkanna: చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి బీసీల్లో ఉన్న ఆదరణ చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టిందని, అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైపోతున్నాడని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటి బీసీలను జగన్మోహన్ రెడ్డి ఎన్ని జన్మలెత్తినా తన వైపునకు తిప్పుకోలేరని ఆయన అన్నారు.

MLC Buddha Venkanna
ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న

MLC Buddha Venkanna: చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి బీసీల్లో ఉన్న ఆదరణ చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టిందని అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైపోతున్నాడని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటి బీసీలను జగన్మోహన్ రెడ్డి ఎన్ని జన్మలెత్తినా తన వైపునకు తిప్పుకోలేరని ఆయన అన్నారు. సీఎం జగన్​ బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని, ఎలాగైనా వారిని తిరిగి ప్రసన్నం చేసుకోవాలని పార్టీ నేతలు చెప్పడంతో జగన్​ సదస్సు పెట్టారే తప్ప మరేమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయం గతంలో ఎప్పుడూ జరగలేదని, ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు బీసీలు అంతా సిద్ధంగా ఉన్నారని వెంకన్న అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.