విశాఖ ఆర్కే బీచ్లో... విశాఖ పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. కేంద్ర నౌకాయానశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. బీచ్లోని ప్లాస్టిక్ తొలగించి శుభ్రపరిచారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా స్వచ్ఛ భారత్కు కేంద్రం మరింత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భాజపా నాయకులు, పోర్టు ట్రస్ట్ సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు.
ఇవీ చదవండి..