ETV Bharat / state

ఏకాంతంగా సింహాద్రి అప్పన్నస్వామి వారి చందనోత్సవం

author img

By

Published : May 4, 2021, 12:21 PM IST

simhachalam
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి

విశాఖ సింహాద్రి అప్పన్నస్వామి వారి చందనోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావలనుకునే వారు 13వ తేదీలోగా విరాళాలను దేవస్థానం అకౌంట్​కు పంపగలరని స్పష్టం చేశారు.

విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయం ప్రకారం 14వ తేదీన నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కు గానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ 11257208642, IFSC:SBIN0002795 కు పంపచవచ్చని స్పష్టం చేశారు.

అర కేజీ చందనం సమర్పణ కోసం రూ. 10,116 , కేజీ చందన సమర్పణకోసం రూ. 20,116 భక్తులు పై అకౌంట్​కు పంపించాలని స్పష్టం చేశారు. విరాళాలు పంపాక దాని స్క్రీన్ షాట్ తీసి మీ చిరునామాను , గోత్రనామాలను 6303800736 నంబర్​కు వాట్సప్, మెసేజ్ చేయాలని తెలిపారు. విరాళాలను 13వ తేదీలోగా పంపించాలన్నారు. చందనోత్సవ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించొచ్చని తెలిపారు. ఏమైనా సలహాలు, సందేహాలుంటే 6303800736కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శనం వేళలు కుదింపు

ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.