విశాఖ జిల్లా రోలుగుంట, రావికమతం ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఈదురు గాలుల బీభత్సం కొనసాగింది. ఈ కారణంగా బాగాపురం, కంచుకమ్ముల, కొవ్వూరు, అడ్డసరం కొంతలం ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ కారణంగా పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నర్సీపట్నం సమీపంలోని రామచంద్రపురం వద్ద పలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భీమునిపట్నం-నర్సీపట్నం రహదారిలో రోలుగుంట వద్ద చెట్లు విరిగి పడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండీ... గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 'అదానీ'కి