ETV Bharat / state

ఫోన్ నెంబర్ లింక్ కోసం తిప్పలు.. ఆధార్​ కేంద్రాల వద్ద పడిగాపులు

author img

By

Published : Jun 9, 2021, 12:20 PM IST

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఫోన్​ నెంబర్​కు ఆధార్ జత చేయడానికి మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ప్రమాదాన్ని విస్మరించి వందలాది మంది గుమిగూడుతున్నారు.

crowd at adhar centres
పాడేరులో మీసేవా కేంద్రాల వద్ద బారులు

ఆధార్‌లో తప్పుల సవరణ, ఫోన్ నెంబర్‌తో అటాచ్‌మెంట్‌ వంటి పనులు.. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. పాడేరు ఏజెన్సీలో గతంలో మూడు ఆధార్ కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం ఒక్కటి మాత్రమే ఉంది. ఇదే సమయంలో.. మహిళలు చేయూత పథకంలో లబ్ధి పొందటానికి ఆధార్ కార్డ్​కు.. ఫోన్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ పరిస్థితుల్లో.. సవరణలు, ఫోన్ నంబర్ల నమోదుకు ఆధార్ కేంద్రాల వద్ద మహిళలు తెల్లవారుజామున 4 గంటల నుంచే వందలాదిగా క్యూ కడుతున్నారు. కరోనా కాలంలో ప్రమాదాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఎక్కువ దరఖాస్తులు చేయలేకపోతున్నామని మీసేవా కేంద్రం నిర్వాహకులు చెబుతుండగా.. మరికొంత సమయం ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

రేషన్ బియ్యం పట్టివేత.. నిందితులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.