ETV Bharat / state

'ధరలు నియంత్రించండి.. పేదల సమస్య పరిష్కరించండి'

author img

By

Published : Oct 6, 2020, 5:59 PM IST

పెరుగుతున్న ధరలను ప్రభుత్వం నియంత్రించాలంటూ అనకాపల్లిలోని ప్రజాసంఘాలు ఆర్డీవో కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపాయి. అనంతరం ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం ఇచ్చారు.

ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేసిన ప్రజాసంఘాలు

అనకాపల్లిలో ప్రజాసంఘాల నేతలు ఆర్డీవో సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. కూరగాయల, నిత్యావసరాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీవో కార్యలయం వద్ద నిరసన తెలిపారు.

పెరుగుతున్న ధరలను ప్రభుత్వం నియంత్రించకపోవడం దారుణమన్నారు. లాక్​డౌన్​ అనంతరం వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోయారు. ధరలు నియంత్రించి పేదల సమస్య పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి:

విలేకరిపై దాడి చేసిన ఎస్​ఐపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.