ETV Bharat / state

విశాఖలో ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలు... తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు, విపక్షాలు

author img

By

Published : Jun 10, 2021, 5:32 PM IST

గ్రేటర్ విశాఖ కార్పొరేషన్‌ పరిధిలో ఆస్తి పన్ను పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనను నగర ప్రజలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ప్రజలు ఎన్నుకున్న జీవీఎంసీ పాలక మండలి ఉండగా... వారితో చర్చించకుండా ఆస్తి పన్ను పెంచడం అప్రజాస్వామికమని వివిధ పార్టీల నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కరోనా సమయంలో ఆస్తిపన్ను పెంపు అనేది పూర్తిగా ప్రజలను ఇబ్బందులపాలు చేయడమేనని అభిప్రాయపడుతున్నారు.

జీవీఎంసీ
జీవీఎంసీ

విశాఖలో ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనలు... తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు, విపక్షాలు

జీవీఎంసీ పాలక మండలి ఏర్పడి మూడు నెలలు గడవకముందే ఆస్తి పన్ను పెంచాలనే ఆలోచన చేయడం నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. చాలామందికి ఉపాధి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తి పన్ను పెరిగితే.. ప్రజలపై మరింత భారం పడనుంది. సౌకర్యాలు కల్పించాల్సిన నగరపాలక సంస్థ ఇలా పన్నులు పెంచితే కష్టమంటున్నారు నగరవాసులు.

భూమి విలువ, స్థలం మార్కెట్ విలువ లెక్కగట్టి దానిపై ఆస్తి పన్ను విధించే విధానం ద్వారా పెద్దఎత్తున ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని వివిధ పార్టీల నేతల అంటున్నారు. ప్రజలపై అదనంగా 700 కోట్ల రూపాయల భారం పడుతుందని చెబుతున్నారు.

విశాఖ ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు ఉన్నా... వారిని సంప్రదించకుండా రాత్రికిరాత్రే నోటిఫికేషన్ ఇచ్చి పన్నులు పెంచాలనుకోవడం నగరవాసులను నడి సంద్రంలో ముంచడమేనని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఆస్తి పన్ను పెంపుపై సమగ్రమైన చర్చ జరగాలంటున్న విశాఖ వాసులు... ప్రజాభిప్రాయం మేరకు మహానగరపాలక సంస్థ నడుచుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

విశాఖ తాగు నీటి నాణ్యతపై.. నివేదికలు సమర్పించండి: ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.