ETV Bharat / state

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

author img

By

Published : Jun 4, 2020, 6:57 PM IST

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ఈ పోస్టర్లు ఉన్నాయి. 'మావోయిస్టులు మీ పద్దతి మార్చుకోండి' అంటూ ఈ గోడపత్రికల్లో రాశారు.

posters
posters

విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. జి.మాడుగుల మండలం మారుమూల మద్దిగరువు సంత పరిసరాల్లో ఈ పోస్టర్లను అతికించారు. గిరిజన ద్రోహులు మావోయిస్టులు అశోక్, శ్రీను, శ్రీకాంత్ అని గోడ పత్రికల్లో రాశారు. "గిరిజనులే.. గిరిజనులనే చంపుతారా...? మావోయిస్టులు మీ పద్ధతి మారకపోతే మా గిరిజనుల చేతిలో శిక్ష తప్పదు" అంటూ ఈ పోస్టర్లలో తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ మద్యం సరిహద్దులు దాటుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.