ETV Bharat / state

INS Iravat: భారత్ నుంచి జకార్తాకు చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్

author img

By

Published : Jul 24, 2021, 9:08 PM IST

INS Iravat reached to indonesia from india with covid relief supplies
జకార్తాకు చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్

ఐఎన్ఎస్ ఐరావత్.. కొవిడ్ సామగ్రితో భారత్ నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తాకు చేరుకుంది. ఐఎన్ఎస్ ఐరావత్ లాండింగ్ షిప్ ట్యాంక్ రకానికి చెందిన నౌక.. ఉభయ చరిగా నేలపైనా, నీటిపైనా పోరాటానికి అవసరమైన యుద్ధ ట్యాంకులు, మిలటరీ కార్గో తీసుకువెళ్లే బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

భారత - ఇండోనేషియా పరస్పరం నిరంతరాయంగా పంచుకోవడం వల్ల.. భావ సారూప్యం ఉన్న దేశాలు ఒకరికొకరు అండగా ఉండాలని ఇరు దేశాలు ఆకాంక్షించాయి. 5 క్రయోజనిక్ కంటైనర్లతో.. వంద మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇతర సామగ్రితో ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పొరుగుదేశాలకు సాయంలో భాగంగా భారత్ వీటిని పంపింది.

ఐఎన్ఎస్ ఐరావత్ లాండింగ్ షిప్ ట్యాంక్ రకానికి చెందిన నౌక.. ఉభయ చరిగా నేలపైనా, నీటిపైనా పోరాటానికి అవసరమైన యుద్ధ ట్యాంకులు, మిలటరీ కార్గో తీసుకువెళ్లే బాధ్యతలను నిర్వర్తిస్తోంది. మానవీయ సాయంలోనూ ఈ నౌకను సరకు రవాణా కోసం ఎక్కువగా వినియోగించడం పరిపాటి.

హిందూ మహా సముద్ర ప్రాంతంలో సాంస్కృతికంగా సారూప్యం ఉన్న దేశాలు రెండూ కావడం వల్ల ఈ ప్రాంతాన్ని వాణిజ్య నౌకలకు పూర్తి భద్రత కల్పించేట్టుగా రెండు దేశాలు జాగ్రత్త వహిస్తున్నాయి. కొవిడ్ బాధితులకు సహాయం అందించడంలో భారత్ ఉదారంగా తన వంతు సాయంగా ఈ పరికరాలను అందించింది. హిందూ మహా సముద్ర పరిసరాల్లో.. శాంతి పరిరక్షణకు రెండు దేశాల నౌకాదళాలు గట్టిగా కృషి చేయాలని మరోసారి నిర్ణయించుకున్నాయి.

ఇదీ చదవండి:

Olympics 2021: మీరాభాయి ఛానుకు గవర్నర్, సీఎం జగన్ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.