ETV Bharat / state

విశాఖలో వానలు.. ప్రమాదస్థాయికి డుడుమ జలాశయం నీటిమట్టం!

author img

By

Published : Jun 14, 2021, 11:21 PM IST

విశాఖ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. డుడుమ జలాశయం నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది.

duduma
డుడుమ జలపాతం

డుడుమ జలపాతం

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో డుడుమ జలాశయం నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. 2,590 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న డుడుమలో.. ప్రస్తుతం 2585.70 అడుగులకు నీటిమట్టం పెరిగింది.

ఇది ఇలా ఉండగా భారీ వర్షాల కారణంగా ముంచంగిపట్టు మండలంలోని రూడకోట వద్ద కల్వర్టు కూలిపోయింది. లక్ష్మీపురం పంచాయతీకి సమీపంలో బిరిగూడ వద్ద నది పొంగడంతో...లక్షీపురం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

Simhadri temple: హిల్ టాప్ రహదారిలోని భవనాలకు మోక్షం

ఈ మాస్క్ పెట్టుకుంటే కరోనా ఖతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.