ETV Bharat / state

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో కరోనా కేసుల కలకలం

author img

By

Published : Jul 14, 2020, 12:31 AM IST

corona cases
corona cases

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల మాచ్​ఖండ్​లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆ గ్రామానికి చెందిన కుటుంబంలో ఇద్దరికి కరోనా సోకినట్లు లమతపుట్ బీడీఓ సౌమ్యసార్ధక్ మిశ్రా వెల్లడించారు.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల మాచ్​ఖండ్​లో ఇద్దరికి కరోన నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని లమతపుట్ బీడీఓ సౌమ్యసార్ధక్ మిశ్రా ధ్రువీకరించారు. మాచ్ ఖండ్ కు చెందిన ఒక కుటుంబం.. గంజాం ప్రాంతంలో వివాహ శుభకార్యానికి వెళ్లి వచ్చారు. విషయం తెలుసుకున్న అధఇకారులు.. వారికి వ్యాధి నిర్ధరణ పరీక్షలు జరిపారు. ఆ కుటుంబంలో ఇద్దరకి కరోన సోకినట్లు ఫలితం వచ్చిందన్నారు. వీరిద్దరినీ సోమవారం జయపురం కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మార్వో మానస్ రంజాన్ పట్నాయక్.. పోలీస్ అధికారి ప్రఫుల్ లక్రా... మాచ్ ఖండ్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతాన్ని శానిటైజేషన్ చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాధి లక్షణాల గురుంచి సర్వే చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

10,100 పడకలతో దేశంలోనే అతిపెద్ద కరోనా కేర్​ సెంటర్​!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.