ETV Bharat / state

కత్తులు పట్టిన పోలీసులు, యువకులు.. ఏం చేశారంటే?

author img

By

Published : Nov 2, 2021, 10:09 AM IST

మన్యంలోని గంజాయి తోటలను ధ్వంసం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యువకులతో కలిసి గంజాయి తోటలను నరికేస్తున్నారు.

CANNABIS PLANTS DESTROY plan in vishakha agency
CANNABIS PLANTS DESTROY plan in vishakha agency

విశాఖ ఏజెన్సీలో గంజాయిని నిర్మూలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి తోటలు ధ్వంసం చేస్తున్నారు. అందుకోసం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాజీరావు ఆధ్వర్యంలో పాడేరు యూత్ ట్రైనింగ్ సెంటర్​లో రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు అధికారులు 10 టీమ్​లుగా ఏర్పడ్డారు. వారందరినీ సమావేశపరిచిన ఉన్నతాధికారులు.. విధి విధానాలను తెలియజేశారు. ఎక్కడైనా గిరిజనులు తిరుగుబాటు చేస్తే శాంతియుతంగా నచ్చచెప్పాలని సూచించారు.

ఇదీ చదవండి: కత్తి పట్టిన విశాఖ ఎస్పీ.. ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.