ETV Bharat / state

గుర్రపు పందేలలో అపశృతి.. జనంపైకి దూసుకొచ్చిన అశ్వం

author img

By

Published : Jan 17, 2022, 1:55 PM IST

Horse rase: గుర్రపు పందేలను తిలకిస్తున్న తమపైకి గుర్రం రావడంతో.. ఒక్కసారిగా ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న ఓ బాలుడు కింద పడిపోవటంతో.. అతని పైనుంచి దాటుకుంటూ గుర్రం పరుగులు తీసింది. విశాఖ జిల్లా మునగపాకలో.. కనుమ రోజున నిర్వహించిన గుర్రపుపందేల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

11
పందాలు తిలకిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చిన గుర్రం.. తప్పిన ప్రమాదం

పందాలు తిలకిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చిన గుర్రం
విశాఖ జిల్లా మునగపాకలో కనుమ రోజున నిర్వహించిన గుర్రపుపందేల్లో అపశృతి చోటు చేసుకుంది. పందేలను తిలకిస్తున్న ప్రజలపైకి గుర్రం దూసుకు రావడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. వేగంగా వచ్చిన గుర్రం.. ఓ బాలుడిని ఢీకొట్టటంతో కిందపడ్డాడు. గుర్రం ఆగకుండా.. ఆ కుర్రాడి పైనుంచి దాటుకుంటూ పరుగులు తీసింది. అయితే గుర్రం కాలు మెలిక పెట్టడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:

kodi pandelu: కాసులు కురిపించిన కోడి పందేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.